జనవరి 12 నుంచి 31వ తేదీ వరకు మరియు ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుక్రవారం ఒక ప్రకటన చేసింది. “తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి 12 నుంచి 31వ తేదీ వరకు, ఫిబ్రవరి నెలకు గాను రూ.300 టికెట్ల ఆన్లైన్ కోటాను జనవరి 9, సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నాం. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరుతున్నాం” అని టీటీడీ పేర్కొంది.
మరోవైపు 2023, జనవరి 5న మొత్తం 47,781 యాత్రికులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారని తెలిపారు. 15,695 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ కానుకలు రూ.2.10 కోట్లు వచ్చినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE