ఆసియా ఛాంపియన్షిప్ రెజ్లింగ్-2022 పోటీల్లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా బంగారు పతకం సాధించాడు. పురుషుల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో శనివారం మంగోలియాలోని ఉలాన్బాతర్లో జరిగిన ఫైనల్ లో కజకిస్థాన్కు చెందిన రఖత్ కల్జాన్ పై సాంకేతిక ఆధిపత్యంతో(12-2) రవి దహియా స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. ఆసియా ఛాంపియన్షిప్ 2020, 2021, 2022 ఎడిషన్స్ లలో వరుసగా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ రికార్డ్ సాధించిన మొట్టమొదటి భారతీయ ఫ్రీస్టైల్ రెజ్లర్ గా రవికుమార్ దహియా ప్రత్యేక గుర్తింపు పొందాడు.
గత ఫిబ్రవరిలో జరిగిన డాన్ కోలోవ్ ఈవెంట్లో రవికుమార్ దహియా రజతం గెలవగా, తాజాగా స్వర్ణం దక్కించుకుని ఈ సీజన్లో రెండో పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మరోవైపు 2021 ఆగస్టులో జరిగిన టోక్యో ఒలింపిక్స్-2020 లో రవికుమార్ దహియా రజత పతకం సాధించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ