స్వాతంత్య్ర సమరయోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “ది గ్రేట్ మంగళ్ పాండే ధైర్యం మరియు దృఢ సంకల్పానికి పర్యాయపదం. అతను మన చరిత్రలో చాలా క్లిష్టమైన కాలంలో దేశభక్తి యొక్క నిప్పురవ్వను రగిలించాడు మరియు అసంఖ్యాక ప్రజలను ప్రేరేపించాడు. అతని జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాను. ఈ సంవత్సరం ప్రారంభంలో మీరట్లోని మంగళ్ పాండే విగ్రహానికి నివాళులు అర్పించాను” అని పేర్కొన్నారు.
భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ట్వీట్ చేస్తూ, “వీర స్వాతంత్య్ర సమరయోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు. అతను అన్యాయమైన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857 సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు మరియు స్వాతంత్య్ర పోరాటంలో చేరడానికి అనేకమందిని ప్రేరేపించాడు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పోషించిన అమూల్యమైన పాత్రతో ఎప్పటికీ గుర్తుండిపోతారు” అని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY