ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (అక్టోబర్ 21, శుక్రవారం) ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా డెహ్రాడూన్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఉత్తరాఖండ్ గవర్నర్ రిటైర్డ్ జనరల్ గుర్మిత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ కేదార్నాథ్ చేరుకొని, శ్రీ కేదార్నాథ్ దేవాలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ పహాడీ దుస్తులను ధరించిన ప్రధాని మోదీ, ఆలయంలో రుద్రాభిషేకం చేసి, నంది విగ్రహం ముందు ప్రార్థనలు చేశారు.
అలాగే ఆది గురు శంకరాచార్య సమాధి స్థలాన్ని కూడా ప్రధాని సందర్శించారు మరియు మందాకిని అస్తపథం మరియు సరస్వతీ అస్తపథంతో పాటు పురోగతిలో ఉన్న పనులను ప్రధాని మోదీ సమీక్ష జరిపారు. కేదార్నాథ్ ధామ్ ప్రాజెక్ట్కు చెందిన శ్రమజీవిలతో కూడా ప్రధాని సంభాషించారు. ఈ పర్యటనలో ప్రధానితో పాటుగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మరియు గవర్నర్ రిటైర్డ్ జనరల్ గుర్మిత్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ బద్రీనాథ్ కు బయలుదేరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY