జూన్ 30, మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. దేశంలో రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అలాగే భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రసంగంలో పలు అంశాల గురించి ప్రజలకు ప్రధాని మోదీ వివరించే అవకాశమున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu