దేశంలో మహారాష్ట్ర రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 29, సోమవారం నాడు కొత్తగా 5257 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,883 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క ముంబయి నగరంలోనే ఇప్పటికి 76765 కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో 181 కరోనా మరణాలు నమోదుకాగా, ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7610 కి చేరింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 2385 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 88960 కి చేరింది. ప్రస్తుతం 73298 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu