రేపు ఢిల్లీలో కర్తవ్య పథ్ ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PM Modi will Inaugurate Kartavya Path and Unveils Netaji Subhas Chandra Bose Statue at India Gate on September 8th, PM Modi To Inaugurate Kartavya Path , PM Modi Unveils Netaji Subhas Chandra Bose Statue, PM Modi Subhas Chandra Bose Statue Inauguration, PM Modi Kartavya Path, Kartavya Path Scheme, Mango News, Mango News Telugu, Kartavya Path, PM Narendra Modi, PM Narendra Modi Latest News And Updates, Netaji Subhas Chandra Bose Statue at India Gate

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ సెప్టెంబ‌ర్ 8, గురువారం సాయంత్రం 7 గంట‌ల‌కు ఢిల్లీలో “కర్తవ్య పథ్” ను ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని రాజ్ పథ్, సెంట్రల్ విస్టా మార్గాలను ఇకపై కర్తవ్య పథ్ గా పేరు మారుస్తూ కేంద్ర నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో రాజ్‌పథ్ అధికారానికి చిహ్నంగా ఉందని, కర్తవ్య పథ్ ప్రజా యాజమాన్యం మరియు సాధికారతకు ఉదాహరణగా మార్పును సూచిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

సంవత్సరాలుగా రాజ్‌పథ్ మరియు సెంట్రల్ విస్టా అవెన్యూ పరిసర ప్రాంతాలు సందర్శకుల రద్దీని పెంచుతూ, దాని యొక్క మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని పెంచుతున్నాయన్నారు. ఇందులో పబ్లిక్ టాయిలెట్లు, తాగునీరు, స్ట్రీట్ ఫర్నిచర్ మరియు తగిన పార్కింగ్ స్థలం వంటి కనీస సౌకర్యాలు లేవని, ఇంకా సరిపోని సూచికలు, నీటి ఫీచర్ల నిర్వహణ మరియు అస్తవ్యస్తమైన పార్కింగ్ ఉన్నాయన్నారు. అలాగే రిపబ్లిక్ డే పరేడ్ మరియు ఇతర జాతీయ కార్యక్రమాలను ప్రజల మూవ్ మెంట్ పై కనీస పరిమితులతో తక్కువ అంతరాయం కలిగించే రీతిలో నిర్వహించాల్సిన అవసరం కూడా భావించబడిందన్నారు. ఈ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని పునర్నిర్మాణం జరిగిందని, అదే సమయంలో నిర్మాణ స్వభావం యొక్క సమగ్రత మరియు కొనసాగింపును కూడా కర్తవ్య పథ్ నిర్ధారిస్తుందన్నారు.

కర్తవ్య పథ్ మార్గంలో ప్రస్తుతం అందమైన ప్రకృతి దృశ్యాలు, నడక మార్గాలతో కూడిన పచ్చిక బయళ్ళు, పచ్చని ప్రదేశాలు, పునరుద్ధరించిన కాలువలు, కొత్త సౌకర్యాల బ్లాక్‌లు, మెరుగైన సంకేతాలు మరియు వెండింగ్ కియోస్క్‌లు ప్రదర్శించబడతాయన్నారు. ఇంకా కొత్త పాదచారుల అండర్‌పాస్‌లు, మెరుగైన పార్కింగ్ స్థలాలు, కొత్త ఎగ్జిబిషన్ ప్యానెల్‌లు మరియు అప్‌గ్రేడ్ చేసిన నైట్ లైటింగ్ పబ్లిక్ అనుభవాన్ని మెరుగుపరిచే కొన్ని ఇతర ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, స్ట్రామ్‌వాటర్ మేనేజ్‌మెంట్, ఉపయోగించిన నీటిని రీసైక్లింగ్ చేయడం, రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్, వాటర్ కన్జర్వేషన్ మరియు ఎనర్జీ ఎఫెక్టివ్ లైటింగ్ సిస్టమ్‌లు వంటి అనేక స్థిరత్వ లక్షణాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయని చెప్పారు.

మరోవైపు ఈ ఏడాది ప్రారంభంలో పరాక్రమ్ దివస్ (జనవరి 23) సందర్భంగా నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రదేశంలోనే తాజాగా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. గ్రానైట్‌తో చేసిన ఈ విగ్రహం మన స్వాతంత్య్ర పోరాటానికి నేతాజీ చేసిన అపారమైన సహకారానికి తగిన నివాళి మరియు దేశం ఆయనకు రుణపడి ఉండేందుకు చిహ్నంగా ఉంటుందన్నారు. ప్రధాన శిల్పి అయిన అరుణ్ యోగిరాజ్ చేత రూపొందించబడిన 28 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం ఏకశిలా గ్రానైట్ రాయి నుండి చెక్కబడిందని, 65 ఎంటీల బరువు ఉంటుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =