టర్కీ, సిరియాలలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై 7.8 తీవ్రతతో సంభవించిన ఈ భారీ భూకంపం వలన టర్కీ, సిరియాలో కలిపి ప్రాణాలు కోల్పోయిన వారి మొత్తం సంఖ్య ఇప్పటికే 360కి చేరింది. అలాగే మరో 516 మంది గాయపడినట్టు అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భూకంపం ధాటికి కూలిపోయిన భవనాల శిథిలాల కింద ఉండిపోయిన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రజలు నిద్ర సమయంలో ఈ భూకంపం సంభవించడంతో భవనాల శిధిలాల కింద మరింతమంది చిక్కుకునే అవకాశం ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరుగనున్నట్టు తెలుస్తుంది. ఈ భూకంపం కైరోకు చాలా దూరంలో, సిరియా సరిహద్దు నుండి 90 కిలోమీటర్ల ప్రాంతంలో గాజియాంటెప్ నగరానికి ఉత్తరంగా కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలో టర్కీలో సంభవించిన విపత్తుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. టర్కీలో సంభవించిన భూకంపం కారణంగా సంభవించిన ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. టర్కీ అధ్యక్షుడు చేసిన ట్వీట్కు ప్రతిస్పందనగా, ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “”టర్కీలో భూకంపం కారణంగా ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. టర్కీ ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుంది మరియు ఈ విషాదం నుంచి తట్టుకోవడానికి అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE