ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు మరో వినూత్న మార్పుకు శ్రీకారం చుట్టారు. పొలాల్లో పురుగుమందులను పిచికారీ చేయడం/ఎరువులను చల్లడంలో భాగంగా రైతులకు సహాయపడే “కిసాన్ డ్రోన్” లను ప్రధాని మోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒకేసారిగా 100 కిసాన్ డ్రోన్ లను ప్రధాని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 100 ప్రదేశాలలో కిసాన్ డ్రోన్లను చూసినందుకు ఆనందంగా ఉందని, గరుడ ఏరోస్పెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే శక్తివంతమైన స్టార్టప్ ద్వారా ఈ అభినందనీయమైన చొరవ తీసుకోబడిందన్నారు. ఈ వినూత్న సాంకేతికత మన రైతులకు శక్తినిస్తుందని, వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మారుస్తుందని అన్నారు.
21వ శతాబ్దానికి చెందిన ఆధునిక వ్యవసాయ సౌకర్యాల ఏర్పాటులో ఇదొక కొత్త అధ్యాయమని అన్నారు. కిసాన్ డ్రోన్స్ ప్రారంభం డ్రోన్ రంగం అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా, అపరిమిత అవకాశాలకు నాందిగా మారుతుందన్నారు. దేశంలో డ్రోన్ స్టార్టప్ల కొత్త సంస్కృతి సిద్ధమవుతోందని, ప్రస్తుతం వాటి సంఖ్య 200 ఉండగా, త్వరలోనే వీటి సంఖ్య వేలల్లో ఉంటుందన్నారు. అలాగే భారీ స్థాయిలో ఉపాధి అవకాశాల కల్పనకు ఈ మార్పు దోహదపడుతుందని ప్రధాని మోదీ చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ