ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని రైతుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించారు. సోమవారం ఆయన రెండు రోజుల ‘పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన ‘వన్ నేషన్-వన్ ఫెర్టిలైజర్’ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా, ఎరువులపై ఇ-మ్యాగజైన్ ఇండియన్ ఎడ్జ్ను కూడా ప్రధాని ప్రారంభించారు. దీనిలో నూతన వ్యవసాయ పద్ధతులు, ధరల పోకడల విశ్లేషణ, లభ్యత మరియు వినియోగం మరియు రైతుల విజయగాథలతో సహా దేశీయ మరియు అంతర్జాతీయ ఎరువుల దృశ్యాలపై మ్యాగజైన్ సమాచారాన్ని అందజేస్తుందని ప్రధాని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా 3.25 లక్షలకు పైగా ఎరువుల దుకాణాలను ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ఈరోజు ప్రధాని మోదీ సంకల్పించారు.
ఇక ఈ పథకం కింద.. అన్ని సబ్సిడీ మట్టి పోషకాలు – యూరియా, డి-అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ), మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపి), ఎన్పికె తదితరాలు ఇకపై దేశవ్యాప్తంగా ఒకే బ్రాండ్ భారత్ క్రింద విక్రయించబడతాయి. భారత్ డిఎపి, భారత్ ఎంఓపి, భారత్ ఎన్పికె మొదలైనవాటితో దేశవ్యాప్తంగా భారత్ యూరియా అనే ఉమ్మడి బ్యాగ్ డిజైన్ను కలిగి ఉంటుంది. ఇది కంపెనీలకు “భారత్” అనే ఒకే బ్రాండ్ పేరుతో ఎరువులను మార్కెట్ చేయడానికి సహాయపడుతుంది. ఎరువులు తప్పనిసరిగా ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ యొక్క పోషక-కంటెంట్ స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉంటాయి కాబట్టి, అన్ని రకాల ఎరువులకు వేర్వేరు బ్రాండ్ల మధ్య ఉత్పత్తి భేదం ఉండదు. అందుకే వీటన్నింటినీ ‘భారత్’ అనే బ్రాండ్ పేరుతో విక్రయిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY