ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సమావేశమయ్యారు. పంజాబ్లో బుధవారం తన పర్యటన సందర్భంగా జరిగిన అవాంఛనీయ సంఘటనలను ప్రధాని వివరించినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ సుమారు 20 ని..లు ఫ్లైఓవర్ పై నిలిచిపోయిన నేపథ్యంలో.. అక్కడ తలెత్తిన భద్రతా లోపాలపై రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం మోదీ ట్విటర్ వేదికగా రామ్నాథ్ కోవింద్కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశాను. నిన్న పంజాబ్ లో జరిగిన భద్రతా లోపం సంఘటనపై ఆందోళన వ్యక్తం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. నా శ్రేయస్సును కోరుతున్నందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు. ఇటువంటి ఆకాంక్షలే మనకు ఎల్లవేళలా స్థైర్యాన్నిస్తాయి’’ అని మోదీ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ