‘కాశీ విశ్వనాథ్ ధామ్’ సిబ్బందికి ప్రధాని మోదీ చిరుకానుక

PM Narendra Modi Sends 100 Pairs Of Jute Footwear For Kashi Vishwanat Dham Workers, PM Narendra Modi, Prime Minister Narendra Modi, Modi sends 100 pairs of jute footwear, Kashi Vishwanat Dham Workers, Kashi Vishwanat Dham, Workers, 100 pairs of jute footwear, 100 pairs, jute footwear, Narendra Modi, Modi's gift to Kashi Vishwanat Dham Workers, Modi gift, Modi heartwarming gesture, PM Modi heartwarming gesture, Mango News, Mango News Telugu,

ప్రతిష్ఠాత్మక ‘కాశీ విశ్వనాథ్ ధామ్’ సిబ్బందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ప్రధాని కలల ప్రాజెక్టు అయిన ‘కాశీ విశ్వనాథ్ కారిడార్’ ఫేజ్-1ను గతేడాది డిసెంబర్ లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్ లో చాలా సేపు గడిపారు. అక్కడ పనిచేసే సిబ్బందితో కలిసి సహపంక్తి భోజనాలు కూడా చేశారు. ప్రతిష్ఠాత్మక కాశీ విశ్వనాథ్ ధామ్ ఆలయ ప్రాంగణంలో రబ్బరు, తోలు చెప్పులు ధరించి తిరగడం నిషిద్ధం. గతేడాది ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది పూజారులు, సిబ్బంది, సేవకులు, సెక్యూరిటీ గార్డులు, పారిశద్ధ్య కార్మికులు.. కాళ్లకు పాదరక్షలు లేకుండా విధులు నిర్వర్తించడం గమనించారు ప్రధాని మోదీ.

ఈ నేపథ్యంలో.. చలికాలంలో కాళ్లకు చెప్పులు లేకుండా వారు పనిచేస్తుండటం చూసి మోదీ చలించిపోయారు. అందుకే, వారి కోసం జనపనారతో ప్రత్యేకంగా తయారుచేసిన 100 జతల పాదరక్షలను అక్కడి సిబ్బందికి పంపించారు. అయితే, ప్రధాని తమను గుర్తుంచుకుని పాదరక్షలను పంపడం వారిని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. ప్రధాని ఈ చర్యపై.. ‘కాశీ విశ్వనాథ్ ధామ్‘ పూజారులు, సిబ్బంది, సేవకులు అందరూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కాగా, గతేడాది వారణాసి పర్యటనకు వచ్చిన ప్రధాని పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. అందులో భాగంగానే రూ. 800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడర్ ను ప్రారంభించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =