అగ్రరాజ్యం అమెరికాలో కరోనా సునామీ విరుచుకుపడుతోంది. ఆ దేశంలో కేసుల సంఖ్య 60 మిలియన్లకి చేరుకుంది. జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు సుమారు 8 లక్షల మంది మృతి చెందారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తన పరిశోధనలో పేర్కొంది. కరోనా మహమ్మరితో అత్యధికంగా ప్రభావితమైన దేశంగా అమెరికా నిలిచింది. పైగా ప్రపంచపరంగా చూస్తే సుమారు 15 శాతానికి పైగా అత్యధిక మరణాలు యూఎస్లోనే సంభవించాయి. అమెరికాలో గతేడాది డిసెంబర్ 13 నాటికి కేసుల సంఖ్య 50 మిలియన్లకు చేరింది. దీంతోపాటు.. అమెరికాలోని కాలిఫోర్నియాలో డిసెంబర్ 1, 2021న కోవిడ్ -19 ఒమిక్రాన్ కొత్త వేరియంట్కి సంబంధించిన మొదటి కేసు నమోదు అయ్యిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్ ఇప్పటి వరకు చాలా దేశాల్లో పెను విధ్వంసం సృష్టిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ