రేపు ‘గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిమ్లాకు వెళ్లనున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. రేపు సిమ్లాలో జరిగే ‘గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్’లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని, వివిధ పథకాల లబ్ధిదారులతో నేరుగా సంభాషించనున్నారు. తొమ్మిది శాఖల పరిధిలోని సుమారు 16 పథకాల లబ్ధిదారులతో ఆయన సంభాషించనున్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానులు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాలలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజలతో సంభాషించడానికి ఈ కార్యక్రమం చేస్తున్నట్లు ఈరోజు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
దీనిలో భాగంగా.. కేంద్ర పథకాల లబ్ధిదారులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు తదితర ప్రజా ప్రతినిధులతో ప్రధాని మోదీ సంభాషించనున్నారు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన, పోషణ్ అభియాన్, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ మరియు పట్టణ), జల్ జీవన్ మిషన్, అమృత్, ప్రధాన్ మంత్రి స్వానిధి యోజన, వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్, ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, ప్రధాన మంత్రి ముద్రా యోజన వంటి పథకాలు ఉన్నాయి. అలాగే రూ. 21,000 కోట్ల విలువైన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడతను మే 31న సిమ్లాలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేస్తారని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF