బీజేపీ పార్టీ ఎంపీ లకు నరేంద్ర మోదీ హెచ్చరిక జారీ చేశారు. పార్లమెంట్ సమావేశాలకు బీజేపీ ఎంపీలు సరిగా హాజరు కాకపోవడంపై మోదీ అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో మోదీ తమ పార్టీ ఎంపీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎంపీలు ఇకనైనా తమ ప్రవర్తన మార్చుకోవాలని మోదీ గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. లేకుంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఆయన వారికి స్పష్టం చేసారు.
బీజేపీ పార్టీ పార్లమెంటరీ సమావేశం మంగళవారం రాజధాని ఢిల్లీ నగరంలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరిగింది. తొలిసారి పార్లమెంట్ భవనంలో కాకుండా బయట ఈ సమావేశం జరగటం విశేషం. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చిన్న పిల్లలకు చెప్పినట్లు ప్రతిసారీ నేను మీకు చెప్పటం బాగాలేదు. ఇకనైనా పద్ధతి మార్చుకోండి. లేదంటే, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని ఆయన హెచ్చరించారు. క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరు కావాలి అని సొంత పార్టీ నేతలకు ఆయన క్లాస్ తీసుకున్నారు. గతంలో కూడా చాలాసార్లు మోదీ సొంత పార్టీ నేతలకు హెచ్చరికలు చేశారు. పార్టీ ఎంపీలు క్రమశిక్షణ పాటించాలని, ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలని, పార్లమెంట్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని గతంలో మోదీ పలు సందర్భాల్లో హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ