ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (ఫిబ్రవరి 5, ఆదివారం) మధ్యాహ్నం 1 గంటకు జైపూర్ మహాఖేల్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. జైపూర్ రూరల్ లోక్సభ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 2017 నుండి జైపూర్లో జైపూర్ మహాఖేల్ నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కబడ్డీ పోటీలపై దృష్టి సారించిన మహాఖేల్ జాతీయ యువజన దినోత్సవం రోజున అనగా 2023, జనవరి 12న ప్రారంభమైంది.
జైపూర్ రూరల్ లోక్సభ నియోజకవర్గంలోని మొత్తం 8 శాసనసభ ప్రాంతాలకు చెందిన 450 గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు మరియు వార్డుల నుండి 6400 మంది యువకులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. మహఖేల్ సంస్థ జైపూర్ యువతకు వారి క్రీడా ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాన్ని అందిస్తుందని మరియు క్రీడను కెరీర్ ఎంపికగా తీసుకునేలా వారిని ప్రోత్సహిస్తుందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE