జనవరి 19న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ

PM Narendra Modi will Visit Karnataka and Maharashtra on 19th January,PM Narendra Modi Visit Karnataka,PM Narendra Modi Visit Maharashtra,Narendra Modi Visit Karnataka,Narendra Modi Visit Maharashtra,Modi Karnataka Visit,Modi Maharashtra Visit,Mango News,Mango News Telugu,PM Narendra Modi,PM Narendra Modi will Visit Karnataka,PM Narendra Modi will Visit Maharashtra,PM Narendra Modi Latest News and Updates,Narendra Modi Latest News and Updates,Narendra Modi Latest News,Narendra Modi News

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (జనవరి 19, గురువారం) కర్ణాటక మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కర్ణాటకలోని యాద్గిరి, కలబురగి జిల్లాల్లో ప్రధాని పర్యటించనున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు యాద్గిరి జిల్లా కోడెకల్‌లో సాగునీరు, తాగునీరు, జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 2:15 గంటలకు కలబురగి జిల్లాలోని మల్ఖేడ్‌ కు ప్రధాని చేరుకుని, అక్కడ కొత్తగా ప్రకటించిన రెవెన్యూ గ్రామాల అర్హులైన లబ్ధిదారులకు హక్కు పత్రాలు (హక్కు పత్రాలు) పంపిణీ చేస్తారు మరియు జాతీయ రహదారి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఇక సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ ముంబయి చేరుకొని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటుగా మరికొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు ముంబయి మెట్రో యొక్క రెండు లైన్లను ప్రధాని మోదీ ప్రారంభించి, మెట్రో రైడ్‌ను కూడా చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 16 =