ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు కర్ణాటక, ఏపీలో రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న‌

Kovind to visit Andhra, Mango News, President, President Kovind on 4-day visit to Karnataka & Andhra, President Kovind to start 3-day visit to Karnataka, President Kovind to visit Karnataka, President Kovind to visit Karnataka Andhra Pradesh, President Ram Nath Kovind on 3-day visit to Karnataka, President Ramnath Kovind, Prez Kovind to visit Karnataka, Ramnath Kovind, Ramnath Kovind to Visit Karnataka and Andhra Pradesh

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫిబ్రవరి 4 వ తేదీ నుండి 7 వ తేదీ వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ముందుగా ఫిబ్రవరి 4, గురువారం సాయంత్రం రాష్ట్రపతి బెంగళూరుకు బయలుదేరుతారు. ఫిబ్రవరి 5 న బెంగళూరులోని యాలెహంకలోని వైమానిక దళం స్టేషన్‌లో ఏరో ఇండియా-21 కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 6న కర్ణాటకలోని కొడగు జిల్లా మాడికేరిని రాష్ట్రపతి సందర్శించి, జనరల్ తిమయ్య యొక్క పూర్వీకుల ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మ్యూజియం ప్రారంభించనున్నారు.

ఇక ఫిబ్రవరి 7 న బెంగళూరులోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యొక్క 23వ వార్షికోత్సవంలో పాల్గొననున్నారు. అదే రోజున ఏపీలోని మదనపల్లెలోని సత్సంగ్ ఫౌండేషన్ యొక్క ఆశ్రమాన్ని, సదుంలోని‌ పీపాల్ గ్రోవ్ స్కూల్‌ను సందర్శించనున్నారు. అనంతరం న్యూఢిల్లీకి తిరిగి ప్రయాణం కానున్నారు. రాష్ట్రపతి మదనపల్లె పర్యటన దృష్ట్యా అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని ఏర్పాట్లును పర్యవేక్షించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two − 2 =