ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరగనున్న సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో భాగంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. 2022 సంవత్సరానికి గాను భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండు పద్మవిభూషణ్, ఎనిమిది పద్మభూషణ్ మరియు 54 పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. నేడు అవార్డు గ్రహీతల్లో రాధే శ్యామ్ ఖేంకా (మరణానంతరం), జనరల్ బిపిన్ రావత్ (మరణానంతరం) పద్మవిభూషణ్ అందుకోనుండగా, గులాం నబీ ఆజాద్, గుర్మీత్ బావా (మరణానంతరం), ఎన్ చంద్రశేఖరన్, దేవేంద్ర ఝఝరియా, రషీద్ ఖాన్, రాజీవ్ మెహ్రిషి, డాక్టర్ సైరస్ పూనావాలా మరియు సచ్చిదానంద స్వామి పద్మభూషణ్ అవార్డులు అందుకోనున్నారు.
2022 సంవత్సరానికి గాను నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అవార్డు గ్రహీతలలో 34 మంది మహిళలు ఉన్నారు. విదేశీయులు/ఎన్ఆర్ఐ/పీఐఓ/ఓసీఐ చెందిన వారు 10 మంది ఉండగా, 13 మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. నేడు సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో భాగంగా మొదటి సెట్ అవార్డులు ప్రదానం చేయనుండగా, మార్చి 28న సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-IIలో రెండవ సెట్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ