భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థత గురయ్యారు. ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో శుక్రవారం ఉదయం ఆయన న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్అండ్ఆర్) ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ఆరోగ్యపరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి మెడికల్ బులెటిన్ ను విడుదల చేసింది. “భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ ఉదయం ఛాతీలో అసౌకర్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించాం, ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది” అని బులెటిన్ లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ