విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్సీపీకి అధినేత శరద్ పవార్, తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్కు చెందిన మల్లికార్జున్ ఖర్గే, జైరాం రమేశ్, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి కూడా హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ వెంట మరికొంతమంది టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఉన్నారు. కాగా జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను ఎంపిక చేశారు. సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్న వాటిలో.. టీఎంసీ, కాంగ్రెస్, సిపిఐ, శివసేన, ఎన్సీపీ, ఎస్పీ, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీ, ఆర్ఎల్డి, పీడీపీ మరియు ఎంఐఎం తదితర పార్టీలు ఉన్నాయి. మరోవైపు అధికార బీజేపీ తమ భాగస్వామ్య పక్షాల ఎన్డీయే అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ముని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ముర్ము జూన్ 24న నామినేషన్ వేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY