దివంగత బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2కి అంత్యక్రియలు సెప్టెంబర్ 19న జరుగుతాయని రాజకుటుంబం శనివారం ప్రకటించింది. రాణి అంత్యక్రియలు లండన్ మధ్యలో ఉన్న రాయల్ చర్చి అయిన వెస్ట్ మినిస్టర్ అబ్బేలో జరుగనున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు హాజరుకావొచ్చని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన చేశారు. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు తాను హాజరవుతానని వెల్లడించారు. రాణి గౌరవార్థం యూకే ప్రభుత్వం అంత్యక్రియలు జరుగనున్న సెప్టెంబర్ 19ను సెలవు దినంగా ప్రకటించింది. కాగా క్వీన్ ఎలిజబెత్-2 స్కాట్లాండ్లోని తన బాల్మోరల్ ఎస్టేట్లో గురువారం మరణించిన సంగతి తెలిసిందే. 96 సంవత్సరాల ఎలిజబెత్ 1952 నుండి బ్రిటన్ రాణిగా కొనసాగారు. ఇక ఆమె మరణంతో బ్రిటీష్ చరిత్రలో సుదీర్ఘమైన రాచరికం ముగిసినట్లయింది. ఎలిజబెత్ తర్వాత ఆమె పెద్ద కుమారుడు ఛార్లెస్-3 నిన్న అధికారికంగా బ్రిటన్ నూతన రాజుగా ప్రమాణం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY