కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాహుల్ పాద యాత్ర నేడు కర్ణాటకలో ప్రవేశించింది. కర్ణాటక లోని చామరాజ నగర్ జిల్లాలో ఎంటర్ అయింది. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉన్నందున రాహుల్ యాత్ర రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఇక తమిళనాడులోని గూడలూరు నుంచి ప్రవేశించిన ఈ యాత్ర దాదాపు 500 కిలోమీటర్ల మేర ఏడు జిల్లాల మీదుగా యాత్ర సాగనుంది.
చామరాజనగర్, మైసూరు, మాండ్య, తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి మరియు రాయచూరు జిల్లాల మీదుగా రాహుల్ యాత్ర వెళుతుంది. మొత్తం ఏడు లోక్సభ నియోజకవర్గాలు, 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం కర్ణాటకలోని గుండ్లుపేట, మైసూరు, బళ్లారిలో మూడు భారీ బహిరంగ సభలు జరగనున్నాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ శివకుమార్ తదితరులు కార్యకర్తలతో కలిసి రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY