మహారాష్ట్ర రాష్ట్రంలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 28, శుక్రవారం నాడు ఒక్కరోజే కొత్తగా 14,361 కరోనా పాజిటివ్ కేసులు, 331 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,47,995 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 23,775 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 11,607 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 5,43,170 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,80,718 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు శుక్రవారం నాటికీ మహారాష్ట్రలో 39,39,761 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu