భారతీయ రైల్వే శాఖ మరో కీలక ప్రకటన చేసింది. జూన్ 30 లేదా అంతకంటే ముందు ప్రయాణం కోసం పాసెంజర్ రైళ్లల్లో బుక్ చేసుకున్న టిక్కెట్లను రద్దు చేస్తునట్టు ప్రకటించింది. లాక్డౌన్ విధించక ముందు అనగా మార్చి 25 లోపు బుక్ చేసుకున్న అన్ని రైలు టిక్కెట్లు రద్దు అవుతాయని, ఆయా వినియోగదారులకు డబ్బు పూర్తిగా వాపసు ఇవ్వనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అయితే కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా చిక్కుకున్న వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించే ఉద్దేశ్యంతో మొదలైన శ్రామిక్ ప్రత్యేక రైళ్లు, అలాగే మే 12 న నుంచి ప్రయాణికుల కోసం తిరిగి ప్రారంభించిన 30 అంతరాష్ట్ర స్పెషల్ రైళ్లు ఎటువంటి మార్పు లేకుండా నిరంతరాయంగా నడుస్తాయని చెప్పారు. టిక్కెట్ల రద్దు నిబంధన వీటికి వర్తించదని చెప్పారు. గూడ్స్ రైళ్లు, నిత్యావసరాల సరఫరా కోసం రైలు కార్యకలాపాలు కూడా అదే విధంగా కొనసాగనున్నాయి. జూన్ 30 వరకు రైలు టికెట్స్ రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడంతో అప్పటి వరకు పూర్తిస్థాయిలో పాసెంజర్ రైళ్ల నడవడంపై సందేహాలు మొదలయ్యాయి. అయితే పూర్తిస్థాయి రైల్వే పునరుద్ధరణకు సంబంధించి ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu