కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని, రాష్ట్రంలో పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఓ వీడియో సందేశాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన ఆరోగ్యం గురించి వాకబు చేసి, త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులుకు ధన్యవాదాలు తెలియజేశారు. రెండు మూడు రోజులలో పూర్తిస్థాయిలో రికవరీ అయి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని భావిస్తున్నాన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటల్స్ లో బెడ్స్ కోసమో, ఆక్సిజన్, వెంటిలేటర్స్, మందులు, రేమిడిసివర్ ఇంజెక్టన్లు దొరకక రోగులు ఇబ్బందులు పడడం అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతను విస్మరించొద్దని, ప్రత్యేకంగా నిరుపేదలు ఈ కరోనా వ్యాధితో బాధపడుతుంటే వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం ప్రభుత్వం బాధ్యతని అన్నారు. వెంటనే కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చాలని కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరపున గాంధీ భవన్ నుంచి కరోనా బాధితులను ఆదుకోవడానికి 24 గంటలు సర్వీసు అందిస్తున్నామని, వారిని అభినందిస్తున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ