హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో కాల్పుల ఘటన కలకలం రేపింది. కూకట్ పల్లిలోని పటేల్ కుంట పార్క్ సమీపంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. బ్యాంక్ వద్ద ఏటీఎం మిషన్ లో సిబ్బంది డబ్బులు రీఫిల్ చేస్తుండగా ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. సెక్యూరిటీ గార్డ్ తో పాటు ఇద్దరు ఏటీఎం సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపి వారివద్ద నుంచి డబ్బులను దోచుకెళ్లారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్ధలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలంలో రెండు బుల్లెట్స్, బులెట్ లాక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన ఆధారాలతో పాటుగా సీసీ కెమెరాల ఫుటేజీ సహాయంతో దోపిడీకి పాల్పడ్డ నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ