ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ కీలక ప్ర‌క‌ట‌న, రెపో రేటు మరో 35 బేసిస్ పాయింట్లు పెంపు, 6.25 శాతానికి చేరిక

RBI Governor Shaktikanta Das Announces MPC Decisions Repo Rate Hiked by 35 BPS Reaches to 6.25 Percent,RBI Governor Shaktikant Das,RBI Governor Key Announcement,Repo Rate Increased By 35 Basis Points,Repo Rate Increased To 6.25 Percent,Repo Rate India,India Repo Rate,Repo Rate India Latest News and Updates,Mango News,Mango News Telugu,RBI Shaktikant Das,RBI Governor Shaktikant Das Latest News and Live Updates,Reserve Bank of India,Repo Rate By 35 Basis Points,RBI News and Live Updates,Rbi Raises Repo Rate By 35 Bps,RBI MPC Live,RBI Hikes Repo Rate,RBI Monetary Policy Highlights,RBI Monetary Policy Outcome,Reverse Repo Rate,Reverse Repo Rate 2022

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బుధవారం ఉదయం ప్రకటించారు. డిసెంబర్ 5 నుంచి 7 తేదీల్లో ఎంపీసీ సమావేశమై స్థూల ఆర్థిక పరిస్థితిని, దాని దృక్పథాన్ని సమీక్షించింది. ఈ నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లను మరోసారి పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. తక్షణమే అమల్లోకి వచ్చేలా పాలసీ రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచి 6.25 శాతానికి పెంచాలని ఎంపీసీ నిర్ణయించిందని గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు రేటు పెంపునకు మొగ్గు చూపారని శక్తికాంత దాస్ తెలిపారు.

కాగా వరుసగా ఐదో సారి రెపో రేటు పెంచారు. మే నెలలోనే రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో 4.40 శాతానికి చేరుకోగా, జూన్ 8న 50 బేసిస్ పాయింట్లు పెరగడంతో 4.90 శాతానికి, ఆగస్టు 5న మరో 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో 5.40 శాతానికి, సెప్టెంబర్ 30న మరో 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో 5.90 శాతానికి, తాజాగా మరో 35 బేసిస్ పాయింట్లు పెంచడంతో రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది.పెరిగింది. తాజా పెంపుతో ప్రస్తుతమున్న వడ్డీ రేట్లను బ్యాంకులు కూడా పెంచే అవకాశం ఉండడంతో, హోమ్, పర్సనల్, వెహికల్ లోన్ తీసుకున్న వినియోగదారులకు, తీసుకునే వారికీ ఈఎంఐ పెరిగే అవకాశముంది.

అలాగే 35 బేసిస్ పాయింట్లు పెంపుతో స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యం (ఎస్డీఎఫ్) రేటు 6 శాతానికి మరియు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు మరియు బ్యాంక్ రేటు 6.5 శాతానికి సర్దుబాటు చేయబడిందని చెప్పారు. వృద్ధికి మద్దతు ఇస్తూనే, ద్రవ్యోల్బణం లక్ష్యంలోనే ఉండేలా చూసుకోవడానికి, అనుకూలత ఉపసంహరణపై దృష్టి పెట్టాలని ఎంపీసీ నిర్ణయించిందన్నారు. 2022-23కి సంబంధించిన వాస్తవ జీడీపీ వృద్ధి అంచనా 6.8 శాతం వద్ద ఉందన్నారు. Q3 వద్ద 4.4 శాతం, మరియు Q4లో 4.2 శాతంగా అంచనా వేస్తున్నామన్నారు. ఇక 2023-24 Q1లో వాస్తవ జీడీపీ వృద్ధి 7.1 శాతంగా, Q2లో5.9 అంచనా వేయబడిందని తెలిపారు.

అదేవిధంగా ద్రవ్యోల్బణం 2022-23లో 6.7 శాతంగా అంచనా వేయబడిందని (Q3 6.6 శాతంగా ఉంది, Q4 వద్ద 5.9 శాతం) చెప్పారు. 2023-24 Q1కి సీపీఐ ద్రవ్యోల్బణం 5.0 శాతంగా, Q2కి 5.4 అంచనా వేయబడిందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. అలాగే సీబీడీసీ/డిజిటల్ కరెన్సీ మరియు యూపీఐ మధ్య వ్యత్యాసాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వివరిస్తూ, యూపీఐ లావాదేవీలలో బ్యాంక్ మధ్యవర్తిత్వం ఉంటుందని అయితే సీబీడీసీలో బ్యాంక్ మధ్యవర్తిత్వం ఉండదని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 4 =