ఏప్రిల్ 14, మంగళవారం ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని దేశంలో రికార్డు స్థాయిలో 20.3 కోట్ల మంది వీక్షించారని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బీఏఆర్సీ) శుక్రవారం నాడు ప్రకటించింది. మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు చేసిన ప్రసంగం ప్రధాని మోదీ గత రికార్డులను మించిపోయినట్టు బార్క్ తెలిపింది. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడం మొదలైనప్పటినుంచి ప్రధాని జాతినుద్దేశించి ఇప్పటి వరకు నాలుగు సార్లు ప్రసంగించారు. ముందుగా జనతా కర్ఫ్యూ, 21 రోజుల లాక్డౌన్ ప్రకటన, ఆ తర్వాత కరోనాపై పోరాటంలో ఐక్యత చాటేలా దీపాలు వెలిగించాలని (ద్వీప ప్రజ్వలన) ప్రజల్ని కోరుతూ మోదీ ప్రసంగించిన సంగతి తెలిసిందే.
మొదటిసారిగా 21 రోజుల లాక్డౌన్ ప్రకటన కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా 19.3 కోట్ల మంది వీక్షించగా, ఏప్రిల్ 14న లాక్డౌన్ పొడిగింపు కార్యక్రమాన్ని 20.3 కోట్ల మంది వీక్షించారని బార్క్ వెల్లడించింది. లాక్డౌన్ పొడిగిస్తూ చేసిన ప్రధాని చేసిన 25 నిమిషాల ప్రసంగాన్ని 199 మంది బ్రాడ్కాస్టర్స్ ప్రసారం చేశారని పేర్కొన్నారు. అలాగే లాక్డౌన్ విధించిన తర్వాత ఏప్రిల్ 12 నాటికి టెలివిజన్ వీక్షకుల సంఖ్య 38 శాతం పెరిగిందని చెప్పారు. దూరదర్శన్ కూడా ఒకప్పటి క్లాసిక్ సీరియల్స్ అయిన రామాయణం, మహాభారతాలను పునః ప్రసారం చేసి ఇతర ప్రైవేటు ఛానెళ్లతో పోటీపడుతుందని తెలిపారు. మరోవైపు ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆరోగ్య సేతు యాప్ను ప్రజలు రికార్డు స్థాయిలో డౌన్లోడ్ చేసుకున్నారని ఏసీ నీల్సన్ అనే ఏజెన్సీ ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu