దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. 24 గంటల వ్యవధిలో తొలిసారిగా 2 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 2,00,739 కేసులు, 1038 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,40,74,564 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,73,123 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్ గడ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ వంటి 10 రాష్ట్రాల్లోనే 80.76 శాతం కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 14,71,877 (10.46%) కు చేరుకుంది. మరో 93,528 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,24,29,564 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 88.31 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.23 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలివే (ఏప్రిల్ 14 8am–ఏప్రిల్ 15 8am) :
- మహారాష్ట్ర – 58952
- ఉత్తరప్రదేశ్ – 20439
- ఢిల్లీ – 17282
- ఛత్తీస్ ఘడ్ – 14250
- కర్ణాటక – 11265
- మధ్యప్రదేశ్ – 9720
- కేరళ – 8778
- తమిళనాడు – 7819
- గుజరాత్ – 7410
- రాజస్థాన్ – 6200
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా మరణాలు నమోదైన రాష్ట్రాలివే:
- మహారాష్ట్ర – 278
- ఛత్తీస్ ఘడ్ – 120
- ఢిల్లీ – 104
- గుజరాత్ – 73
- ఉత్తర్ ప్రదేశ్ – 67
- పంజాబ్ – 63
- మధ్యప్రదేశ్ – 51
- కర్ణాటక – 38
- జార్ఖండ్ – 31
- రాజస్థాన్ – 29
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ