కోవిడ్-19 (కరోనా వైరస్) సృష్టించిన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో పలు ఇతర దేశాలకు అండగా నిలుస్తున్న భారత్ను ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఐరాస పిలుపు మేరకు ఇతర దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్స్ అందిస్తూ భారత్ అందరికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. కరోనా చికిత్సలో మంచి ఫలితాల కోసం ఎక్కువుగా వాడుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్స్ ను ఇప్పటికే భారత్ అనేక దేశాలకు పంపింది.
సౌత్ ఆసియా అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ (సార్క్) లోని సభ్య దేశాలకు సహాయం చేయడంతో పాటుగా వీటిలో అమెరికా, బ్రెజిల్, మారిషస్ సహా పలు ఐరోపా, ఆఫ్రికా దేశాలకు భారత్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్స్ ను పంపించింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా భారత్ తన మిలిటరీ ఆరోగ్య నిపుణులను కువైట్ మరియు మాల్దీవులకు పంపింది. అలాగే ఇటీవలే తమకు క్లోరోక్విన్ మాత్రల్ని అందించాలన్న రష్యా అభ్యర్థనను అంగీకరిస్తూ భారత్ స్పందించడం పట్ల రష్యా కూడా సంతృప్తి వ్యక్తం చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu