ఈ రోజు నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో పంజాబ్కు చెందిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఈ శకటాన్ని రూపొందించారు. పంజాబ్లో స్వాతంత్ర్య పోరాట కాలం నాటి సందర్భాలను వివరించే విధంగా ఈ శకటాన్ని రూపొందించారు. స్వాతంత్ర్యయోధులు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ప్రధమస్థానంలో నిలిపిన తీరు ఆకట్టుకుంది. అలాగే, జలియన్వాలా బాఘ్ నిందితుడు జనరల్ డయ్యర్ను.. సద్ధామ్ ఉద్దమ్ సింగ్ లండన్ వెళ్లి కాల్చి చంపిన ఘటనను కూడా కళ్ళకు కట్టారు. త్రివిధ దళాలతో పాటు వివిధర రాష్ట్రాలు, వివిధ మంత్రిత్వ శాఖల శకటాల్లో స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఘట్టాలు కనిపించినప్పటికీ పంజాబ్ శకటమే ఎక్కువ మందిని ఆకర్షించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF