జీవిత కాల విశిష్ట సేవలను గుర్తించి ఏటా భారత ప్రభుత్వం అందించే ‘పద్మ’ అవార్డులు తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులకు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మ భూషణ్ అవార్డ్ ను సంయుక్తంగా దక్కించుకున్న భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు కృష్ణ ఎల్లా మరియు సుచిత్ర ఎల్లా, ఆర్ట్ విభాగంలో పద్మశ్రీ అవార్డులను దక్కించుకున్న దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్య, పద్మజ రెడ్డిలను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా వారికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ