టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షుల పేర్లను ప్రకటించారు కేసీఆర్. దీనిలో భాగంగా 19 మంది ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్ష పదవులు లభించగా.. ముగ్గురు ఎంపీలకు.. అలాగే ముగ్గురు జడ్పీ చైర్మన్లకు, ఇద్దరు ఎమ్మెల్సీలకు జిల్లా అధ్యక్ష పదవులు లభించాయి.
టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వీరే…
హైదరాబాద్ – మాగంటి గోపినాథ్, రంగారెడ్డి – మంచిరెడ్డి కిషన్రెడ్డి, మేడ్చల్ – శంభీపూర్ రాజు, నిజామాబాద్ – జీవన్రెడ్డి, కామారెడ్డి – నుజీబుద్దీన్, ఆదిలాబాద్ – జోగురామన్న, కొమరంభీం – కోనేరు కోనప్ప, మంచిర్యాల – బాల్క సుమన్, నిర్మల్ – విఠల్రెడ్డి, కరీంనగర్ – రామకృష్ణారావు, సిరిసిల్ల – తోట ఆగయ్య, జగిత్యాల – విద్యాసాగర్రావు, పెద్దపల్లి – చందర్, మెదక్ – పద్మాదేవేందర్రెడ్డి, సంగారెడ్డి – ప్రభాకర్, సిద్ధిపేట – కొత్త ప్రభాకర్రెడ్డి, వరంగల్ – ఎ.రమేష్హన్మకొండ – వినయ్భాస్కర్, జనగామ – సంపత్, మహబూబాబాద్ – కవిత నాయక్, ములుగు – కుసుమ జగదీష్, భూపాలపల్లి – జ్యోతి, యాదాద్రి – రామకృష్ణారెడ్డి, వికారాబాద్ – ఆనంద్, మహబూబ్నగర్ – లక్ష్మారెడ్డి, నాగర్కర్నూలు – గువ్వల బాలరాజు, నారాయణపేట – రాజేందర్రెడ్డి, వనపర్తి – గట్టి యాదవ్, ఖమ్మం – మధుసూదన్, భద్రాద్రి – కాంతారావు, నల్గొండ – రవీంద్ర కుమార్, సూర్యాపేట – లింగయ్య యాదవ్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF