కరోనాపై పోరాటంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు దేశంలో పలు కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులతో సహా అన్ని వర్గాల నుంచి పీఎం కేర్స్ కు విరాళాలు అందాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యల కోసం పీఎం కేర్స్ నిధి నుంచి రూ.3100 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మే 13, బుధవారం నాడు ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. ఈ నిధులను వెంటిలేటర్ల కొనుగోలు, వలస కార్మికుల సంక్షేమం, కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ఉపయోగించనున్నారు.
వీటిలో రూ.2000 కోట్లతో దేశంలో తయారైన 5000 వెంటిలేటర్లు కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్రపాలిత ప్రాంతాల ఆధ్వర్యంలో నడిచే కోవిడ్ ఆసుపత్రులకు అందజేయనున్నారు. వెచ్చించనున్నారు. ఇక రూ.1000 కోట్లను వలస కార్మికుల కోసం కేటాయించి రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనున్నారు. రాష్ట్రప్రభుత్వాల ద్వారా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ల వద్ద ఈ నగదు ఉంచి వలస కార్మికుల వసతి, భోజన సదుపాయాలు, వైద్య చికిత్స, రవాణా కోసం వినియోగించనున్నారు. మరో రూ.100 కోట్లను కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం కేటాయించారు.
PM-CARES Fund Trust Allocates Rs. 3100 Crore for Fight against COVID-19. https://t.co/jMaY8ZTE7F
via NaMo App pic.twitter.com/fwlgJYVeRO
— PMO India (@PMOIndia) May 13, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu