సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించడంలో సహకరించినందుకు జెలెన్స్కీకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు.. ఉక్రెయిన్ లోని ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. గడచిన 12 రోజులుగా కొనసాగుతున్న యుద్ధ సంక్షోభంపై ఇరువురు సుమారు 35 నిమిషాల పాటు మాట్లాడుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్ష చర్చలు కొనసాగడాన్ని కూడా ప్రధాని మోదీ అభినందించారు. ఉక్రెయిన్లో వివాదం మొదలైన తర్వాత మోదీ, జెలెన్స్కీ మధ్య ఇది రెండో టెలిఫోనిక్ సంభాషణ కావడం గమనార్హం.
కాగా, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న తీవ్రమైన పోరులో దాదాపు 700 మంది వరకు భారతీయ విద్యార్థులు సుమీలో చిక్కుకుపోయినట్లు సమాచారం. సుమీలో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కూడా సహకరించాలని ఈ సందర్భంగా వ్లాదిమిర్ జెలెన్స్కీని ప్రధాని కోరారు. పౌరుల తరలింపునకై సోమవారం ఉదయం నుండి రష్యా కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుండి ప్రజలు పెద్ద ఎత్తున వలస బాట పడుతున్నారు. దీనికోసం.. అనేక ప్రాంతాలలో మానవతా కారిడార్లను ప్రారంభించారు. అయితే, మరోవైపు రష్యా సాయుధ దళాలు ఉక్రేనియన్ నగరాలను దెబ్బతీయడం మాత్రం ఆపలేదు. బహుళ రాకెట్ లాంచర్లు పలు నగరాలలోని నివాస భవనాలను కూల్చివేస్తుండటం విశేషం. కాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్ కాల్ తర్వాత.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు కూడా ప్రధాని ఫోన్ చేయొచ్చని భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ