తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా తొలిరోజునే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు 2022-23 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,30,825.96 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్ను రూపొందించారు. మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగం రెండు గంటల పాటు సాగింది. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన వెంటనే శాసనసభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
మరోవైపు తొలిరోజునే బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావును సస్పెండ్ చేస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ముందుగా మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతున్నారని, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావు ను సస్పెండ్ చేయాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ఆమోదం తెలుపుతూ, ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ