అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ బుధవారం నాడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సత్య నాదెళ్లను తమ బోర్డు చైర్మన్ గా నియమించింది. మైక్రోసాఫ్ట్ బోర్డ్ చైర్మన్ గా సత్య నాదెళ్ల ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు తెలిపారు. ఇక 2014లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నుంచి ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించి, ఇప్పటివరకు బోర్డు చైర్మన్ గా వ్యవహరించిన జాన్ థాంప్సన్ ఇకపై ఇండిపెండెంట్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. స్టీవ్ బాల్మెర్ నుండి 2014 లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల పలు ఇన్నోవేషన్స్ తో సంస్థ వ్యాపారాన్నిపెంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సంస్థ చైర్మన్ గా కూడా ఎన్నికయి మరిన్ని బాధ్యతలు నిర్వహించేందుకు భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల సిద్ధమయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ