ఎప్పటికప్పుడు బ్యాంకులు, ఆర్బీఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏదొక అప్ డేట్ వస్తూనే ఉంటుంది. దానికి ఇది లింక్ చేయండి.. దీనికి అది లింక్ చేయండి లేదంటే పనిచేయదు అంటూ న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. దీంతో ఎన్ని అర్జంట్ పనులున్నా వాటిని పక్కన పెట్టి మరీ బ్యాంకులకు, మీ సేవా కేంద్రాలకు పరుగులు పెడతారు. లేదంటే సిస్టమ్ ముందు కూర్చుని ఆన్ లైన్లో అవి అప్ డేట్ చేయడానికి తంటాలు పడుతుంటారు.
అయితే ఇలాంటప్పుడే కొన్ని సందేహాలు వెంటాడుతాయి. నిజంగానే ఈ వార్త నిజమా లేక ఫేక్ నా అని. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు నుంచి వచ్చినట్లుగా ఓ మెసేజ్ సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా వైరల్ అవుతుంది. దీంతో ఖాతాదారులంతా అయోమయానికి గురవుతున్నారు. ఎస్బీఐ పంపినట్లుగా ఉన్న ఆ మెసేజ్లో ..మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ను పాన్ కార్డ్తో వెంటనే లింక్ చేయకపోతే మీ అకౌంట్ బ్లాక్ చేయబడుతుందని ఉంది. ఎస్బీఐ అకౌంట్ హోల్డర్స్కు ఆ మెసేజ్ రావడంతో కొద్ది మంది బ్యాంకులకు కూడా వెళ్లి ఆరా తీస్తున్నారు. అయితే ఈ విషయంపై పీఐబీ అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫాక్ట్ చెక్.. క్లారిటీ ఇచ్చింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తన అధికారిక ఎక్స్ ప్లాట్ఫామ్లో ఈ విషయంపై ట్వీట్ చేస్తూ.. కొద్ది రోజులుగా స్టేట్ బ్యాంక్ పేరుతో మోసగాళ్లు మీ అకౌంట్కు పాన్ నంబర్ను యాడ్ చేసి అప్డేట్ చేయకపోతే అకౌంట్ క్లోజ్ చేస్తాం అని మెసేజ్లు పంపుతున్నట్లు మాకు సమాచారం అందింది. మీ అకౌంట్ బ్లాక్ చేయబడుతుందంటూ కాల్ లేదా ఏదైనా లింక్ ద్వారా మీ పాన్ కార్డ్ సమాచారాన్ని అప్డేట్ చేయాలని మీకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అలాంటి మెసేజ్ వస్తే పొరపాటున కూడా నమ్మొద్దని..అవి పూర్తిగా నకిలీ అని క్లారిటీ ఇచ్చింది.
మరోవైపు తామెప్పుడూ ఎప్పుడూ కూడా ఎవరికీ కాల్ చేయడం లేదా మెసేజ్ చేసి.. వారి అకౌంట్ సంబంధిత సమాచారాన్ని అప్డేట్ చేయమని ఎవరికీ సూచించమని.. స్టేట్ బ్యాంక్ చెబుతోంది. అంతేకాదు పాన్ వివరాలను అప్డేట్ చేయమని ఎవరికీ కూడా బ్యాంక్ ఎలాంటి లింక్ను పంపదని చెప్పింది. ఎవరైనా ఎటువంటి సైబర్ క్రైమ్కు గురైనా కూడా.. వెంటనే సైబర్ క్రైమ్ సెల్ నంబర్ 1930లో లేదా [email protected] కి ఈ మెయిల్ ద్వారా తమ కంప్లైంట్ను నమోదు చేయవచ్చని బ్యాంక్ తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ