రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం నాడు వెల్లడించారు. దేశ చరిత్రలో తొలిసారిగా గిరిజన కమ్యూనిటీకి చెందిన ద్రౌపది ముర్ముకు రాష్ట్రపతిగా అవకాశం రావడంతో ఆమెకు మద్దతివ్వాలని పలువురు శివసేన ఎంపీలు ఉద్ధవ్ థాకరే విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా బీజేపీతో విబేధాలు తీవ్ర స్థాయికి చేరినప్పటికీ ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే మద్ధతు ఇవ్వాలని ఉద్ధవ్ థాకరే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికకు ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ ముగియగా, జూలై 18న ఓటింగ్ జరుగుతుందని, జూలై 21వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY