పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 17న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఆదివారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు అన్ని పార్టీలకు తెలిపింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆ తర్వాతి రోజు సోమవారం (జూలై 18) ప్రారంభమవనున్నాయి. అదేరోజు సెషన్లో రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జూలై 25న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే ఈ సమావేశాలు ఆగస్టు 18 వరకు కొనసాగనున్నాయి. అయితే వర్షాకాల సమావేశాలు సాధారణంగా జూలై మూడవ వారంలో ప్రారంభమవుతాయి మరియు ఆగష్టు 15న జరుపుకునే స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ముగుస్తాయి.
కాగా భారతదేశం-చైనా సరిహద్దు ప్రతిష్టంభన, సాయుధ దళాలకు స్వల్పకాలిక రిక్రూట్మెంట్ కోసం అగ్నిపథ్ పథకం, నిరుద్యోగం మరియు రూపాయి విలువ పడిపోవడం వంటి కొన్ని కీలక అంశాలపై ఈ పార్లమెంటు సమావేశాలలో ప్రతిపక్షాలు బలంగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సమావేశాలు సజావుగా కొనసాగేందుకు సహకరించవలసినదిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేయనుంది. ఈ సమావేశాలలోనే ఉపరాష్ట్రపతి పదవికి కూడా ఎన్నిక జరుగనుంది. ఆగస్టు 6న ఎన్నికలు నిర్వహించి, ఆగస్టు 11న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ