దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్ లో విచారణకు హాజరైన గ్యాంగ్స్టర్ జితేందర్ గోగిని లక్ష్యంగా చేసుకుని లాయర్ దుస్తుల్లో వచ్చిన ఓ గ్యాంగ్ కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో గ్యాంగ్స్టర్ జితేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఘటన సందర్భంగా పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు దుండగులు కూడా హతమయ్యారు. కాగా మరణించిన మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఘటనలో మరికొందరికి గాయాలైనట్లు సమాచారం.
కొంతకాలంగా ఇరు గ్యాంగ్ ల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరే ఈ ఘటనకు దారి తీసినట్టు తెలుస్తుంది. ముందుగా అనేక కేసుల్లో నిందితుడిగా గ్యాంగ్స్టర్ జితేందర్ గోగి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఓ కేసు విచారణలో భాగంగా పోలీసులు శుక్రవారం అతన్ని ఢిల్లీలోని రోహిణిలోని కోర్టుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో లాయర్ దుస్తుల్లో వచ్చిన దుండగులు అతనిపై కాల్పులకు పాల్పడ్డారు. కోర్టు విచారణ సందర్భంగా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ