కర్ణాటకలో హిజాబ్ వివాదం దేశాన్నే కుదిపేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ హయాంలో ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడంపై నిషేధం విధించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణాయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్ధించింది. ఇస్లాం ప్రకారం హిజాబ్ తప్పనిసరిగా ధరించాలనే నియమం ఏమీ లేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రోటోకాల్ను తప్పనిసరిగా పాటించాల్సిందేనని తేల్చిచెప్పింది. దీంతో హిజాబ్ వివాదం మరింత ముదిరింది. పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపట్టారు.
అయితే హిజాబ్కు సంబంధించి ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచనల నిర్ణయం తీసుకున్నారు. గతంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణాయానికి భిన్నంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. హిజాబ్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. షిజాబ్ ధరించడంపై ఒక నుంచి ఎటువంటి నిషేధం ఉండదని.. నిషేధాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుందని వివరించారు. మైసూర్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయిన సిద్ధరామయ్య.. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
మహిళలు వారికి నచ్చితే హిజాబ్ ధరించవచ్చు లేదంటే లేదని.. అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయమని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇక నుంచి మహిళలు హిజాబ్ ధరించి స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లొచ్చని వెల్లడించారు. మహిళలు ఏ డ్రెస్ వెసుకుంటున్నారు.. ఏం తింటున్నారన్నది వారి వ్యక్తిగత ఎంపిక అని వెల్లడించారు. ఎవరికి ఇష్టంవచ్చినట్లుగా వారు హిజాబ్ ధరించవచ్చని.. వారిని అడ్డుకునే హక్కు మాకు ఎక్కడిదని సిద్ధరామయ్య ప్రశ్నించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE