దేశంలో కొత్తరకం కరోనా వైరస్ (యూకే కరోనా స్ట్రెయిన్) పాజిటివ్ కేసుల సంఖ్య 165 కు చేరుకున్నట్లుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాజిటివ్ గా తేలిన వారిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన ప్రోటోకాల్స్ ప్రకారం పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. అలాగే వారి కాంటాక్ట్ వ్యక్తులను కూడా క్వారంటైన్ లో ఉంచి పర్యవేక్షణ చేస్తునట్టు తెలిపారు. మరోవైపు యూకే కరోనా స్ట్రెయిన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 70 కి పైగా దేశాలకు వ్యాప్తి చెందింది. దీంతో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా పాజిటివ్ గా తేలితే జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వివిధ ఇన్సాకోగ్ ల్యాబ్లకు శాంపిల్స్ ను పంపుతున్నట్టు పేర్కొన్నారు.
లాబ్స్/ఇన్స్టిట్యూట్ వారీగా నిర్ధారణ అయిన కొత్తరకం కరోనా పాజిటివ్ కేసులు వివరాలు:
- ఎన్సీడీసీ న్యూఢిల్లీ – 42
- ఐజీఐబీ న్యూఢిల్లీ – 51
- ఎన్ఐబిఎంజి కళ్యాణి కోల్కతా – 1
- ఎన్ఐవీ పూణే – 44
- సీసీఎంబీ హైదరాబాద్ – 8
- ఎన్ఐఎంహెఛ్ఏఎన్ఎస్ బెంగళూరు – 14
- ఎన్సిబీఎస్, ఇన్స్టెమ్ బెంగళూరు – 5
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ