కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 2,605 కరోనా కేసులు, 31 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 52,30,891 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 46,203 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 3,281 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 51,58,423 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 25,586 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక తిరువనంతపురం జిల్లాలో అత్యధికంగా 4491 యాక్టీవ్ కేసులు ఉండగా, ఎర్నాకులంలో 4305, కోజికోడ్ లో 3356, కొట్టాయంలో 2985, త్రిస్సుర్ లో 2077, మలప్పురంలో 1455, ఇడుక్కిలో 1321, కన్నూర్ లో 1246, కొల్లంలో 1035 కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాటికి కేరళలో 4,11,21,401 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ