ప్రముఖ నటుడు కమల్ హాసన్ నెలకొల్పిన రాజకీయ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’ (ఎంఎన్ఎం) కాంగ్రెస్లో విలీనం అయినట్లు వస్తున్న వార్తలపై పార్టీ స్పందించింది. పార్టీ వెబ్సైట్ హ్యాక్కు గురయ్యిందని, ఈ వార్తలను ఖండిస్తున్నామని ఎంఎన్ఎం ట్విట్టర్ హ్యాండిల్ ప్రకటించింది. కాగా పార్టీ అధికారిక వెబ్సైట్ www.maiam.comలో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయనున్నట్టు పోస్ట్ చేయడంతో సైబర్ దాడి వెలుగులోకి వచ్చింది. అందులో.. ‘మక్కల్ నీది మయ్యం ద్వారా 2024 లోక్సభ ఎన్నికలకు పెద్ద ప్రకటన’ అనే శీర్షికతో, పార్టీ వెబ్సైట్లో ‘అధికారిక విలీనం 30 జనవరి 2023న జరుగుతుంది’ అని పేర్కొంది. అయితే దీనిపై పార్టీ అధికార ప్రతినిధులు స్పందించారు. ఇందులో ఎటువంటి నిజం లేదు, కాంగ్రెస్లో విలీనం చేసే ఆలోచనలు లేవు అని వారు తెలిపారు. పార్టీ అధికారిక వెబ్సైట్ను కొంతమంది హ్యాక్ చేశారని, అలాంటి బెదిరింపులకు పార్టీ భయపడదని మరియు తగిన సమాధానం ఇస్తుందని వెల్లడించారు.
కాగా ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్ పాల్గొన్న తర్వాత ఈ రకమైన చర్చలు జరుగుతున్నాయి. అలాగే కొద్ది రోజుల క్రితం ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలకు అధికార డీఎంకే కూటమికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థికి కమల్ హాసన్ బేషరతుగా మద్దతు పలికారు కూడా. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి కమల్ నడవనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక కమల్ హాసన్ 2018లో ఎంఎన్ఎం పార్టీని ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినీతి, రాజవంశ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతానని, అలాగే గ్రామీణ సాధికారత సాధిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లోనూ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఓడిపోయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE