రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితి కారణంగా జూన్ 29, సోమవారం నుంచి జూలై 31 అర్ధరాత్రి వరకు లాక్డౌన్ను పొడిగిస్తునట్టు ప్రకటించింది. ఇంతకు ముందు ‘మిషన్ బిగిన్ అగైన్’ పేరుతో రాష్ట్రంలో ప్రకటించిన పలు మార్గదర్శకాలు మరియు సడలింపులను జూలై 31 వరకు అదే విధంగా పాటించాలని ప్రభుత్వం ప్రజలని కోరింది.
మరోవైపు దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. జూన్ 29 నాటికీ మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,64,626 కు చేరుకుంది. వీరిలో 86,575మంది కోలుకోని డిశ్చార్జ్ అవగా, 7429 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 70,607 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu