తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే కరోనా మరణాల సంఖ్య 11 వేలు దాటింది. శుక్రవారం నాడు కొత్తగా 2608 కరోనా పాజిటివ్ కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 7,22,011 కు, మరణాల సంఖ్య 11,091 కి చేరింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 3,924 మందితో కలిపి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 6,87,388 కి చేరింది. ప్రస్తుతం 23,532 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు అక్టోబర్ నాటికీ తమిళనాడులో 98,85,443 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu