దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్ తో బాధపడుతున్నవారికి అండగా ఉండేందుకు సన్ టీవీ (సన్రైజర్స్ హైదరాబాద్) రూ.30 కోట్లు విరాళాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా కట్టడికి జరుగుతున్న అనేక కార్యక్రమాలకు ఈ నిధులు ఖర్చు చేయబడతాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన వివిధ కార్యక్రమాలకు విరాళాలు అందిస్తామని చెప్పారు. అలాగే ఆక్సిజన్ సిలిండర్లు, మందులు మొదలైనవి అందించే ఎన్జీఓలతో భాగస్వామ్యం అవుతామని తెలిపారు. వీటితో పాటుగా దేశంలో మరియు ప్రపంచంలోని మిలియన్ల మంది టీవీ చూసే ప్రేక్షకులలో కరోనా కట్టడిపై ఎక్కువ అవగాహన కల్పించడానికి తమ మీడియా సంస్థలు, ఇతర వనరులతో తోడ్పాటు అందిస్తామని సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ