సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్’ సమావేశంలో పాల్గొన్న రజనీకాంత్ సోమవారం చెన్నైలోని రాజ్ భవన్లో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశం మర్యాదపూర్వకం గానే గవర్నర్ ను కలిశానని చెప్పారు. తామిద్దరం దాదాపు 30 నిమిషాలు గడిపామని, ఈ సందర్భంగా ఎన్నో విషయాలు మా మధ్య చర్చకు వచ్చాయని తెలిపారు. గవర్నర్ రవి తన జీవితంలో ఎక్కువ సమయం ఉత్తరాదిలో గడిపారని, అయినా తమిళనాడు రాష్ట్రాన్ని మరియు ఇక్కడి ప్రజలను ఎంతో ప్రేమిస్తారని రజనీ అన్నారు.
అయితే గవర్నర్ తమిళుల కృషి మరియు నిజాయితీని ఇష్టపడతారని, మరీ ముఖ్యంగా ఇక్కడి ఆధ్యాత్మికత అంటే ఆయనకు ఎంతో ఇష్టమని రజనీకాంత్ పేర్కొన్నారు. తమిళనాడు సంక్షేమం కోసం ఏం చేయడానికైనా సిద్ధమని రవి చెప్పారని, దీంతో ఆయనపై మరింతగా గౌరవం పెరిగిందని చెప్పారు రజనీకాంత్. తాము రాజకీయాల గురించి కూడా చర్చించామని, అయితే ఆ వివరాలను తాను మీడియాకు వెల్లడించలేనని రజనీ అన్నారు. ఇక భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా రాజకీయ పార్టీని స్థాపించి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని 2017లో ప్రకటించిన రజనీకాంత్, ఆ తర్వాత కొన్ని అనారోగ్య కారణాల రీత్యా 2020 డిసెంబర్లో తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY